ముగిసిన ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్

-

దేశంలో ఐదో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో అధికారులు నిర్వహించారు.

సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా, ఐదో దశలో యూపీలోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7,ఒడిశాలోని 5, బిహార్‌లోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్‌ ,లద్ధాఖ్‌లోని చెరో లోక్‌సభ స్థానానికి ఎన్నికల జరిగాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news