కేటీఆర్ ను అందుకే సీఎం చేస్తున్నారట.. పొన్నాల ఆసక్తికర వ్యాఖ్యలు

-

కేసీఆర్ ది లీకులు.. ప్రెస్ నోట్ల పాలన అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సమీక్షలు లేకుంటే లీకులు… సమీక్షిస్తే ప్రెస్ నోట్లు అంతే కానీ ప్రజలకు చెప్పడానికి ముఖం లేదు అని అయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఏడాది లో పూర్తి ఐతదా..?  ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పాలమూరు.. డిండి ప్రాజెక్టు గుర్తొచ్చింది అంటూ ఆయన విమర్శించారు.  కేసీఆర్ పాపం పండుతుంది… జనం బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

కేసీఆర్ కిట్ కి ఐదు వేలు ఇచ్చి… ఒక్కో బిడ్డ మీద లక్ష రూపాయలు అప్పులు వేస్తున్నాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ నీ పాపాలు కేటీఆర్ కి అంట గడతావా..? అందుకే కేటీఆర్ కి పగ్గాలు .? ఇస్తున్నారా అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చరిత్ర హీనుడిగా మారబోతున్నారన్న ఆయన  కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని… ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. అక్కరకు రాని పనులు చేస్తున్నారు అని మేము అంటుంటే… ఇంకా అదనపు పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version