సమ్మక్క సారమ్మలను దర్శించుకున్న మంత్రి పొన్నం..!

-

కరీంనగర్ రేకుర్తి వద్ద సమ్మక్క సారమ్మల జాతర వనదేవతల్లి ని బిసి వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే సలహాలు సహకారం అందివ్వాలని అన్నారు. వాళ్ళకి అలా బుద్ధి కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

500 రూపాయలకు గ్యాస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రైతు భరోసా చేయూత ఇలా అన్ని పథకాలు కూడా త్వరలోనే అమలు అవుతాయని అన్నారు. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు ప్రభుత్వం ఏర్పడి 75 రోజులు కూడా కాలేదు తొందరపడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడి నోరు పారేస్కోవడం చేస్తున్నారని అన్నారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Exit mobile version