కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదు: పొన్నం

-

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్షపాతం మీద రాజకీయం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు రాలేదు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిన దగ్గర ఓట్లు అడగండి అంటూ కామెంట్లు చేశారు.

ఇందిరమ్మ ఇల్లు కట్టిన వద్ద మేము ఓట్లు అడుగుతాం రైతుబంధు అందరికీ ఇస్తాం ఇదివరకు రైతుబంధు మార్చి నెల వరకు ఇచ్చారు. రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 40 వేల కోట్లు బిల్లులు ఆగిపోయాయి అని పొన్నం ప్రభాకర్ అన్నారు మేము చేసిన వాస్తవాలు ప్రజలకు చెప్తాం కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి కేంద్రం నుండి రావాల్సిన వాటాని తీసుకుంటామని అన్నారు పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Latest news