ఆర్టీసీ ని కాపాడుకోవాలి: పొన్నం ప్రభాకర్

-

ఆర్టీసీ మనందరిదీ దానిని కాపాడుకోవాలని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కొండాపూర్ 8వ బెటాలియన్ లో టిఎస్ఆర్టిసి కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా ఉన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా పాల్గొన్నారు ఆర్టీసీ ప్రజల సంస్థాదినిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకి కారుణ్య నియమాల కింద ఎనిమిది వందల మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆర్టీసీ సంస్థని తిరిగి తెలంగాణకి ప్రజలకి నెంబర్ వన్ రవాణా సంస్థగా ఉంటే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు గతంలో కరోనా సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు వాటిని అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందని అన్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version