బార్బీ బొమ్మలా మారిపోయిన బుట్ట బొమ్మ..కేన్స్‌లో పూజాయే స్పెషల్ అట్రాక్షన్

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే..‘ఒక లైలా కోసం’ మూవీతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో రాకెట్ లా దూసుకుపోయి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ ఈ భామ కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఎద అందాలు కనిపించేలా హాట్ లుక్ ఇస్తున్న ఫొటోలు షేర్ చేసింది.సదరు ఫొటోలు ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో దిగినవి. కాగా, అక్కడ ఈ భామ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

భారత ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా పూజా హెగ్డే..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడింది. పూజా హెగ్డే ఫొటోలు చూసి నెటిజన్లు ‘బుట్ట బొమ్మ బార్బీ బొమ్మలా మారిందని, రాజకుమారిలా ఉందని’ పోస్టులు పెడుతున్నారు. ఈ భామ F3 సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ప్రజెంట్ ఈ సుందరి బాలీవుడ్ ఫిల్మ్స్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న SSMB 28 సినిమాలో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version