ఏపీ సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

-

సినిమా టికెట్ల పై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదంపై ఎంతోమంది.. ఏపీ సర్కార్ తో చర్చలు నిర్వహించారు. కానీ ఇప్పటివరకు.. ఈ సమస్య కొలిక్కి రాలేదు. అయితే తాజాగా ఏపీ లో సినిమా టికెట్ల అంశంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.

రాధేశ్యాం సినిమా విడుదలకు ముందు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పై జీవో ఇస్తే తాను సంతోషిస్తానని వెల్లడించారు. కొత్త జీవో ప్రకారం టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఆ జీవో ఎప్పుడు వస్తుందో…? దానికి సంబంధించిన విషయాలు తనకు తెలియదని తాను కూడా ఆ జీవో కోసం వెయిట్ చేస్తున్నట్లు వివరించారు.

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంచాలని ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని కమిటీ రిపోర్టు సమర్పించినా… ఇంకా ఏపీ సర్కార్ జీవో ఇవ్వలేదు. తాజాగా ప్రభాస్ నటించిన రాదేశ్యాం సినిమా మార్చి 11వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version