అమృత, ప్రణయ్‌ల ప్రేమ‌క‌థ‌పై సినిమా..!!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన వార్త ఏమైనా ఉందా అంటే అది ప్రణయ్, అమృత ల ప్రేమ హత్య నే . ప్రణయ్ ని అతి కిరాతంగా మారుతీరావు హత్య చేయించాడు . తన కూతురిని తనకు కాకుండా చేశాడన్న కోపం తో కన్నకూతురి పసుపుకుంకాలని కన్న తండ్రే తుడిచేసాడు. ఇక ఇటీవ‌ల అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో.. మరోసారి ఈ పేర్లు వినబడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రేమకథ ఆధారంగా ఓ సినిమా వస్తుంది. నర్రా శివనాగేశ్వర రావు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఇందులో సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలక పాత్రల్లో నటించనున్నారట. కాగా ఈ సినిమాకి అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నటుడు బాలాదిత్య మీడియాతో తెలిపారు.

అయితే వాస్తవిక ఘటనలను చూపిస్తూనే.. సినిమా పరంగా కూడా టచ్ ఇచ్చాడని తెలిపాడు. కాగా.. ఇందులో అర్చన తనకు జంటగా నటించనుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మించారు. కాగా, ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. దీంతో మ‌రో సారి అమృత‌, ప్ర‌ణ‌య్‌ల ప్రేమ‌క‌థ హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version