తెలంగాణ ఆడపడుచులు ఉసురు మోడీకి తగులుతుంది – ప్రశాంత్ రెడ్డి

-

ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై బీజేపీ మోడీ ప్రభుత్వంపై మంత్రి వేముల ఫైర్ అయ్యారు.”దేశంలో మోడీ అవినీతి పాలనను కేసిఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తాలేక వారి కుమార్తె ఎమ్మెల్సి కవితమ్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడి నోటీసుల పేరిట వేధిస్తున్నారు. ఇది నీచాతినీచమైన రాజకీయ కుట్ర. యావత్ దేశ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న కేసిఆర్ గారిపై కేంద్ర బీజేపీ మోడీ రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమే ఇవన్ని. కేసిఆర్ గారి బిడ్డను ఇబ్బంది పాలు చేసి కేసిఆర్ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని దురాలోచన చేస్తున్నది మోడీ సర్కార్ కానీ ఎన్ని కుట్రలు చేసినా కేసిఆర్ తలొగ్గరన్నారు.

 

ఇట్లాంటి ఊకదంపుడు బెదిరింపులకు భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధించేవాడే కాదు. మేమంతా కేసిఆర్ కుటుంబ సభ్యులమే ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి మేం బెదిరే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమ బిడ్డలకు అరెస్టులు,జైళ్లు కొత్తేమీ కాదు. బరాబర్ నరేంద్ర మోడీ అవినీతి పాలనను ప్రజల్లో ఎండగడతాం. బీజేపీ మోడీ,అమిత్ షా ఎట్లా చెప్తే అట్లా వ్యవహరిస్తున్నాయి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈడి,సిబిఐ బిజెపికి తోబుట్టువులా పనిచేస్తున్నాయి. లక్షల కోట్ల దేశ సంపదను కొల్లగొడుతున్న మోడీ దోస్త్ అదానీ పై ఎలాంటి చర్యలు లేవు. మోడీ బినామీ అదానీ ఎల్ఐసి,ఎస్బిఐ లలో ప్రజలు దాచుకున్న సొమ్మును దోచుకున్నాడు. ఇందులో వేల కోట్ల కుంభ కోణం జరిగింది దమ్ముంటే దానిపై ఈడి,సిబిఐ కేసులు పెట్టి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ మోడీ గద్దె దిగేవరకు మా పోరాటం ఆగదు. ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీ మోడీకి తెలంగాణ ఆడపడుచుల ఉసురు తగులుతుంది.”వేముల ప్రశాంత్ రెడ్డి అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version