ప్రచారంలో కొత్త ఎత్తుగడ అంటే ఇదేనేమో?

-

గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేత ప్రతాప్‌రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.  ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీశ్‌ తనను ప్రైవేటు వ్యక్తుల నంబర్ నుంచి ఫోన్ చేసి కోరినట్లు ఆయన వెల్లడించారు. శనివారం జరిగిన పార్టీ ప్రచార కర్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థియ సాయం  అందిస్తానని ఆయన హరీశ్ రావు అన్నట్టు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.. పార్టీలోని అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ రాష్ట్రంలో తన  ఇజ్జత్ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. వినడానికి ఈ మాటలే బాగానే ఉన్నా… మీటింగ్ లో ఉన్న ఇతరులు ప్రతాప్ రెడ్డి బలే అబద్దం చెప్పాడు అంటూ ఒకరినొకరు చూసుకుని తెగ నవ్వేసుకున్నారంటా…ఇక నియోజకవర్గంలో ఎలాగైన తాను కేసీఆర్ ని ఓడించి గెలవాలనే పట్టుతో ఉన్న ప్రతాప్ రెడ్డి ఫేక్ పబ్లిసిటీని ఆయన సొంత పార్టీలో ఉన్నవారే నమ్మే పరిస్థితి లేదు…ఏది ఏమైన ప్రచారంలో ఇదో రకం ఎత్తుగడ అంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version