రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఫోన్‌లో అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ

-

రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్‌కు పిఎం నరేంద్ర మోడీ ఇవాళ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ 88శాతం ఓట్లతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని మోడీ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. ‘రష్యా ఫెడరేషన్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇండియా, రష్యా మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయడానికి అంగీకరించాం’ అని పేర్కొన్నారు.. ఫోన్ సంభాషణలో ఇండియా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నాని కోరారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడంలో చర్చలు, దౌత్యమే ముందున్న మార్గమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల అధినేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ వరుసగా ఐదవసారి గెలుపొందారు. దాదాపు 88 శాతం ఓట్లతో పుతిన్ ఘన విజయం సొంతం చేసుకున్నారు.24 ఏళ్ల పాలనను మరో ఆరేళ్లు కొనసాగించనున్నారు.1999 నుంచి పుతిన్ ఒక్కసారిగా కూడా ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొనకపోవడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news