దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళలో మెరిశారు. దాదాపు 144 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ మెగా మహా కుంభమేళలో… ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యస్నానాలు చేశారు. ప్రయాగ్ రాజు లోని త్రివేణి సంగమం స్థలం వద్ద అమృత స్నానం ఆచరించి… దేశానికి మంచి జరగాలని మొక్కుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో కుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి… అంతకుముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు.
ఆ తర్వాత ఇద్దరూ కలిసి అరైలు ఘాటు నుంచి పడవ ప్రయాణం చేశారు. గంగా యమునా సరస్వతి కలిసి ప్రవహించే త్రివేణి సంగమం… వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవాల్టి అమృత స్నానాలు ఉంటాయని యోగి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనాలు కూడా… కోట్లల్లో వస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది జనాలు ప్రయాగ్రాజులో… పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD)
#MahaKumbh2025 pic.twitter.com/j3OQiCp80q
— ANI (@ANI) February 5, 2025