మరో కీచకపర్వం.. 10 తరగతి విద్యార్థినులతో ప్రిన్సిపల్‌ వికృత చేష్టలు

-

కాటేదాన్‌లో విద్యా నికేతన్ స్కూల్‌లో దారుణం ప్రిన్సిపాల్ 10 తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు . విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడే విద్యార్థినులపట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విద్యార్థినులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులతో పంచుకున్నారు. అయితే వారు స్కూల్‌కు వచ్చి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.

కాటేదాన్‌లోని రాకేష్ విద్యా నికేతన్ స్కూల్‌లో గుర్రం శంకర్‌ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారి ముందు వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. అయితే ప్రిన్సిపాల్ తీరుతో విసిపోయిన పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. ప్రిన్సిపాల్ దురుసుగా సమాధానం చెప్పడంతో అతనిపై షీ టీమ్స్‌కు, మైలార్‌దేవ్‌ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version