Priyamani: నీలి రంగు గౌనులోన..అందాలు ఆరబోసి సెగలు రేపుతున్న ప్రియమణి

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియమణి..బుల్లితెర పైన ‘ఢీ’ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. మరో వైపున సినిమాలు కూడా చేస్తోంది. అలా టెలివిజన్, సిల్వర్ స్క్రీన్ పైన రెండిటిపైన కనబడుతున్న ప్రియమణి..సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

తన లేటెస్ట్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది ప్రియమణి. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. ఇప్పుడు కూడా అవకాశమొస్తే చేయడానికి రెడీగానే ఉన్నట్లుంది.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా నీలి రంగు గౌనులో దిగిన ఫొటోలను ప్రియమణి షేర్ చేసింది. సదరు ఫొటోలకు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది ఈ సుందరమ్మ. కొంత మంది మహిళలు నిప్పును చూస్తే భయపడతారని, కానీ, కొందరు మాత్రం నిప్పులా మారుతారని పోస్టులో పేర్కొంది.

నీలి రంగు గౌనులో అలా నిలబడి, నడుము పై చేయి పెట్టి, నవ్వుతూ, అటు వైపునకు, ఇటు వైపునకు చూస్తూ తన అందాలతో మైమరిపించింది బ్యూటిఫుల్ ప్రియమణి. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘క్వీన్, వెరీ బ్యూటిఫుల్ లుక్, నైస్, అందాల భామ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version