కోదండరాం పార్టీకి కీలక నేత రాజీనామా

-

ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీకి కీలక మహిళా నేత రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఫ్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి టీజేఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు  చేసింది. పార్టీలో మొత్తం వ్యాపారం నడుస్తోందని ఆరోపించారు.  పెద్దమనుషుల్లా కనబడే వారికి బాగోతం త్వరలోనే బట్టబయలే చేస్తానని ఆమె హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే మీడియా సమావేశంలో పలు అంశాలును వెల్లడిస్తానని చెప్పారు. దీంతో తెలంగాణలోని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version