సెల్ఫ్ క్వారెంటైన్ కు సీఎం.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల వలనే !

-

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 77వేల 266 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33లక్షల 87వేలు దాటింది. కొత్తగా వెయ్యి 75మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 61వేలు దాటిపోయింది. ఒక్కరోజు వ్యవధిలో ఇంతపెద్ద ఎత్తున కేసులు నమోదు కావడం ఇది తొలిసారి.

అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రజా ప్రతినిధులు కరోన బారిన పడుతున్నారు. మరీ దారుణంగా పంజాబ్‌లో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. అయితే ఆ ఎమ్మెల్యేలలో ఇద్దరు తనను కలిసినవారు కావడంతో సీఎం అమరీందర్‌ సింగ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. నిజానికి మొన్న ఒక్క రోజు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ రోజునే ఈ ఇద్దరూ సిఎంను కలిశారు. దీంతో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వారం రోజుల క్వరెంటైన్ కు వెళుతున్నట్టు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news