సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం జగన్ తో ఒలింపిక్ కాంస్య విజేత పీవీ సింధు భేటీ అయ్యారు. ఒలింపిక్ లో వరుసగా రెండో సారి మెడల్ సాధించిన సింధును ఈ సందర్భంగా అభినందించారు సీఎం జగన్. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ… సీఎం జగన్‌ తనను అభినందించారని తెలిపారు. మెడల్ సాధించాలని తనను ప్రోత్సహించారన్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ ను ప్రోత్సహించడం కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.

ప్రభుత్వం అండగా ఉంటే మరిన్ని పతకాలు సాధించడానికి అవకాశం ఉందన్నారు. త్వరలో ఏపీలో అకాడమీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు. సింధు కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈవో భ్రమరాంబ.  అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సింధు కుటుంబ సభ్యులు. దర్శనాంతరం సింధుకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందించారు ఆలయ ఈఓ భ్రమరాంబ.

Read more RELATED
Recommended to you

Exit mobile version