తన వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరో చెప్పేసిన రఘురామకృష్ణం రాజు !

-

గత కొద్ది రోజులుగా వైసీపీకి సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పక్కలో బల్లెంలా మారాడు. ఆయన సొంత పార్టీ నేతలనే విమర్శిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన తన వెనక ఉంది ఎవరనే అంశాన్ని ఆయన బయట పెట్టారు. నా వెనక ఉన్నది వెంకటేశ్వర స్వామి అన్న ఆయన ప్రజా సమస్యల్ని వేలెత్తి చూపిస్తున్నా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వకుండా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం దురదృష్టకరమన్న ఆయన ఆచారాన్ని గౌరవించమని కోరాం కానీ ప్రభుత్వ నిబంధనను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని అన్నారు. ముఖ్యమంత్రి తిరుమలలో మాస్క్ పెట్టుకోలేదనన్న ఆయన ముఖ్యమంత్రిని చూసి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారని అందుకే ముఖ్యమంత్రి నిబంధనలు పాటించాలని అన్నారు.

ముఖ్యమంత్రి ఆదర్శవంతుడిగా ఉండాలి కానీ, వేలెత్తి చూపే వాడిగా ఉండొద్దని అన్నారు. ముఖ్యమంత్రి హిందువేనా….!? క్రైస్తవుడా ..!? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయన్న ఆయన స్వరూపానందేంద్ర స్మామి మాత్రమే జగన్ ఎవరు అనేది చెప్పగలరని అన్నారు. ముఖ్యమంత్రి ఏ మతస్తుడు అని క్రైస్తవులు కూడా ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. కొడాలి నాని చేయాల్సిన వ్యాఖ్యలు చేసి, మంత్రి హోదాలో మాట్లాడలేదు..వ్యక్తిగతంగా అన్నాను అని చెప్పడం బాధాకరమని అన్నారు. మనోభావాలు దెబ్బతీసేలా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రిగా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడి దాడి చేస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version