BREAKING : వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా..వైసీపీకి భారీ ఊరట !!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో…. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు గురించి తెలియని వారుండరు. వైసీపీ పార్టీలోనే ఉంటూ… జగన్‌ సర్కార్ కు వ్యతిరేకంగా స్టేట్‌ మెంట్లు ఇస్తూ.. నిత్యం మీడియా ముందు కనిపిస్తూ ఉంటారు. దీంతో గత ఏడాది కాలం నుంచి… వైసీపీ పార్టీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ను దూరం పెడుతూ వస్తుంది. అటు ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కూడా… వైసీపీ సర్కార్‌ కు వ్యతిరేకంగా… ఏదో ఓ కామెంట్‌ చేస్తూనే ఉన్నారు.

దీంతో ఎంపీ రఘు రామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని… ఇప్పటికే రెండు సార్లు.. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బీర్లాను కలిశారు వైసీపీ ఎంపీలు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు లోక్‌ సభ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి తరుణంలో… ఎంపీ రఘు రామ కృష్ణం రాజు సంచలన ప్రకటన చేశారు. ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని… రాజీనామా చేసి మళ్లీ గెలుస్తానని ప్రకటించారు ఎంపీ రఘు రామ కృష్ణం రాజు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే.. ఎప్పుడు రాజీనామా చేసేది మాత్రం ఎంపీ రఘు రామ కృష్ణం రాజు చెప్పలేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన కామెంట్లు హాట్‌ టాపిక్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version