మాజీ ప్రధాని పీవీకి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళి

-

క్రీస్తు సందేశాన్ని ప్రజలకు వినిపించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాగద్వేషాలను జయించాలని, అంతేకానీ వీడియో చూడగానే ఫినిష్ హిమ్ అని అనవద్దని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. శత్రుత్వాన్ని మరిచి శత్రువులను కూడా ప్రేమించాలని క్రీస్తు సందేశాన్ని వినిపించిన కొద్ది గంటల వ్యవధిలోనే జగన్ మోహన్ రెడ్డి గారు భగవత్ స్వరూపమని తమ పార్టీ ప్రకటించిందన్నారు. తనని తాను భగవంతునిగా ప్రకటించుకున్న జగన్మోహన్ నందా స్వామి వారు తాను వినిపించిన ప్రవచనాన్ని తనతో ప్రారంభిస్తారేమో చూడాలన్నారు.

తానేమీ జగన్ మోహన్ రెడ్డి గారికి శత్రువును కాదని, ప్రజలకు మిత్రున్ని మాత్రమేనని తెలిపారు. ఒకవేళ శత్రువుని అయినప్పటికీ, ఒక మనిషిని ఎన్నిసార్లు శిక్షిస్తారు… ఆల్రెడీ ఒక సారి కోటింగ్ ఇచ్చారు.. ఆ కోటింగ్ ఇచ్చిన వీడియో చూసి జగన్ మోహన్ రెడ్డి గారు ఆనందించారు అని అన్నారు. ఇప్పుడు ఆయన మారిపోయారని, జగన్ మోహన్ రెడ్డి గారేమి మామూలు మనిషి కాదు భగవంతుడయి పోయారని, ఇంక మామూలు మనుషులమైన తనతో పాటు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వంటి వారి గురించి ఆలోచించడం మానివేయాలనిహితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news