జగన్ కు షాక్ : రాష్ట్రపతికి రఘురామ లేఖ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మరోసారి  వైసిపి రెబెల్, నరసాపురం  ఎంపీ రఘురామ కృష్ణరాజు షాక్ ఇచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ పై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని ఈ లేఖలో ప్రస్తావించారు రఘురామకృష్ణరాజు.

ఆర్టికల్ 360 ద్వారా ఆంధ్రప్రదేశ్ లో  ఆర్థిక అత్యఇక స్థితి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం నెలకొంటుందని… రాష్ట్ర ఆర్థిక లోటు డిసెంబర్ నాటికే… రూ. 68536 కోట్లు దాటిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా జగన్ సర్కార్ కు గగనం అయిపోయిందని వెల్లడించారు రఘురామ కృష్ణరాజు.  జూలై మాసం రెండవ వారం కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించు కొని తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు విజ్ఞప్తి చేశారు ఎంపి రఘురామ కృష్ణరాజు.

Read more RELATED
Recommended to you

Latest news