డ్రైనేజీ లో గల్లంతైన అంతయ్య మృతదేహం లభ్యం

-

వనస్థలిపురం లో ఆరు రోజుల కింద మ్యాన్ హోల్ క్లీనింగ్ చేస్తూ నాలో గల్లంతయిన అంతయ్య మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. మ్యాన్ హోల్ లో పడి ఇ అంతయ్య తోపాటు శివ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగిన రోజే శివ మృతదేహం లభ్యం కాగా అంతయ్య మృతదేహం మాత్రం దొరకలేదు.

గత ఆరు రోజుల నుంచి అంతయ్య మృతదేహం కోసం అధికారులు తీవ్రంగా గాలించారు. ఘటనా స్థలం నుంచి అంతయ్య మృతదేహం మూడు వందల యాభై మీటర్ల దూరం కొట్టుకుపోయింది. అయితే తాజాగా ఇవాళ గాలింపు చర్యల్లో అంతయ్య మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం అంతయ్య మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం చేసే అవకశాలు ఉన్నాయి.  కాగా గత మంగళవారం అర్ధరాత్రి సమయంలో మాన్ హోల్ క్లీనింగ్ చేస్తుండగా పారిశుద్ధ కార్మికులు మరియు శివ అందులో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news