జోడో యాత్రలో రాహుల్ పెళ్లి ప్రస్తావన.. ఆయన రియాక్షన్ ఏంటంటే..!

-

కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్కడ ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు.

 

“మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్​లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news