తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు… బీ అలర్ట్

-

తెలుగు రాష్ట్రాలను ఇప్పటికీ వర్షాలు వదలలేదు. ఇప్పటికే తెలంగాణాలోని హైదరాబాద్ లో వరదలు రచ్చ రేపాయి. ఏపీలో కూడా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాల వలన పంట నష్టం ఏర్పరింది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వాయువ్య దిశ అనంతరం ఇది ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం కారణంగా మరో 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తాంధ్రలో కూడా ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news