రాగల 5 రోజుల పాటు వర్షాలు… ఎల్లో అలెర్ట్ జారీ

-

తెలంగాణలో రాగల 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లోకి వానలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి,ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట,వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.బుధవారం నుంచి గురువారం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి,కొత్తగూడెం, ఖమ్మం,నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట,వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట,మెదక్‌, భువనగిరి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతాయని పేర్కొంది. ఇక గురువారం నుంచి శుక్రవారం వరకు భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version