చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది .. వైసీపీపై వర్ల రామయ్య పైర్

-

మాజీ ముఖ్యమంత్రి జగన్ మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు . 26 జిల్లాలో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారని మండిపడ్డారు. రూ. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతులు తీసుకోలేదని తెలిపారు. అధికారంలో ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం ఆయన సొంత జాగీరా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

”మా కార్యాలయాలు పడగొడతున్నారంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. మీ కార్యాలయాలు పడగొట్టడంలో లేదు.. అక్రమంగా ఏ పర్మిషన్ లు తీసుకోకుండా నిర్మించిన కట్టడాలను మాత్రమే పడగొడుతున్నారు అని ఆయన స్పష్టం చేశారు. ఈ విధ్వంసానికి కారకులు మీరు, 10 మందికి ఉపయోగపడే ప్రజా వేదికను కూలగొట్టింది కూడా మీరే అని అన్నారు. అనుమతులు లేని కార్యాలయాలు పడగొడుతుంటే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అని ప్రశ్నించారు. అధికారం మీ చేతుల్లో ఉంటే అక్రమ నిర్మాణాలు చేపడతారా? అన్ని జిల్లాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version