సొంత పార్టీకి మళ్ళీ షాక్ ఇచ్చిన రాజాసింగ్..!

-

పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన ఘట్టానికి చేరుకున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు అనుచరులు ముఖ్య నేతల తో పెద్ద ఎత్తున ర్యాలీ కి బయలుదేరి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే అందరూ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. గడపగడపకి వెళ్లి ఓట్లని అడుగుతున్నారు. అన్ని పార్టీల హడావిడి అలా ఉంటే బీజేపీ తంతు మాత్రం ఇంకోలా ఉంది రాష్ట్రం లో బిజెపి అభ్యర్థులని ప్రకటించిన నాటి నుండి అధిష్టానం పై కాస్త గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి షాక్ ఇచ్చారు.

ఎంపీ అభ్యర్థి మాధవి లత నామినేషన్ కార్యక్రమానికి వస్తానని ఆఖరి నిమిషం లో హ్యాండ్ ఇచ్చారు అభ్యర్థిగా మాధవి లతని ప్రకటించిన నాటి నుండి రాజసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కనీసం ఇవ్వకుండా అభిప్రాయాన్ని తెలుసుకోకుండానే ఆమెని ఫిక్స్ చేయడం రాజాసింగ్ కి నచ్చలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version