లైంగిక వేధింపులకు పాల్పడితే గవర్నమెంట్ జాబ్ కు అనర్హత !

-

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున సీఎంగా అశోక్ గెహ్లాట్ ఉన్నారు, ఇతని సారధ్యంలో రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన చట్టాలను మరియు పాలనా పద్దతులను తీసుకుని వచ్చి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఇక తాజాగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు లైంగిక వేధింపులు చేసిన నేరస్థులు అందరినీ ట్రాక్ చేసి పట్టుకుని, వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రిపోర్ట్ రెడీ చెయ్యాలని రాజస్థాన్ పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. అంతే కాకుండా మరోసారి వీరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా వారిపై కఠినమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు సీఎం గెహ్లాట్.

ఇంకా ఈ దారుణాలు చేసిన మరియు ఇక చేయబోయే వారు ప్రభుత్వ రంగాలలో ఎటువంటి ఉద్యోగం దక్కకుండా ఉండేలా చర్యలను తీసుకోవాలంటూ పోలీస్ శాఖకు చెప్పడం జరిగింది. ఈ లిస్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నారని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version