రాజస్థాన్ ,కోల్కత్తా మ్యాచ్ రద్దవ్వాలి: SRH ఫ్యాన్స్

-

రాజస్థాన్, కోల్కతా మధ్య గువాహటిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఒకవేళ మ్యాచ్ మొత్తానికి రద్దయితే రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కు తలో పాయింట్ లభిస్తుంది. అదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ రెండో ప్లేస్ ను పదిలం చేసుకోనుంది. రాజస్థాన్ రాయల్స్ కు కూడా 17 పాయింట్లు రానుండగా.. ఆ జట్టు కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. దీంతో వర్షం తగ్గొద్దని, మ్యాచ్ రద్దవ్వాలని సన్ రైజర్స్ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

కాగా, ఈరోజు తన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 66, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33, నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 37, క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. అథర్వ (46), ప్రభుసిమ్రాన్ సింగ్ 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే రోస్సో కూడా 49 పరుగులు చేశాడు.జితేష్ శర్మ ఇవాళ 32 పరుగులు చేసి చివరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news