Maharastra : ఎన్నిక వేళ ఉచిత యోగ,ఫుడ్ పై డిస్కౌంట్

-

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి స్థానిక పరిపాలనతో పాటు అనేక రెస్టారెంట్లు, కేఫ్‌లు పోలింగ్ జరిగే రోజుల్లో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి ఆఫర్‌లను అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మే 20, సోమవారం నాడు పొలింగ్ జరగనుంది.నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముంబై అంతటా ఫుడ్‌పై 20 శాతం తగ్గింపును అందిస్తోంది. ముంబైలో కూడా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచడం కోసం ప్రోత్సహకరంగా పలు రెస్టారెంట్లు, కేఫ్‌లు ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. పోలింగ్ రోజు ముంబైలో మెట్రో లైన్లు 2A, 7లోని ప్రయాణికులకు ప్రత్యేకంగా 10 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తుండగా, కార్డ్, పేపర్ క్యూఆర్, పేపర్ టిక్కెట్‌లను ఉపయోగించి పోలింగ్ స్టేషన్‌లకు ప్రయాణించి, ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి రావడానికి, బేస్ చార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news