“జైభీమ్” డైరెక్టర్ తో ప్రాజెక్ట్ కు రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ … మరో బ్లాక్ బస్టర్ !

-

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ సినిమా జైలర్ అందించిన సక్సెస్ ను ఆస్వాదించే పనిలో పడ్డాడు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పకడ్బందీ స్క్రీన్ ప్లే కు ప్రేక్షకులు అంతా ఫిదా అయ్యారు.. ఈ సంతోషంలో ఉండగానే రజినీకాంత్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతంలో సూర్య హీరోగా వచ్చిన జై భీం మూవీ ఎంతటి ఘానా విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను టిజి జ్ఞానవేల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి ఇండస్ట్రీ లో ప్రముఖుల ప్రశంసలను అందుకున్నాడు. ఈయన డైరెక్టర్ గా రజినీకాంత్ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు కూడా జైలర్ కు మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ నే తీసుకుంటుండడం గమనార్హం. ఈ సినిమాను లేక ప్రొడక్షన్స్ నిర్మించడానికి ముందుకు వచ్చింది..

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినికాంత్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, శర్వానంద్ లాంటి కీలక నటులు స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నారు. మరి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version