డబుల్ సస్పెన్స్ థ్రిల్లర్ తో రానున్న రాక్షసుడు 2..!

-

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ కి గురి చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఒక సైకో కిల్లర్ కథ ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెలుగులో రాక్షసుడుగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి విధితమే. ఇక అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేయడమే కాకుండా టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ని కూడా ఇవ్వకపోవడం గమనార్హం . ఇక ఈ నేపథ్యంలోనే రాక్షసుడు సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ఈ సినిమాపై డైరెక్టర్ రమేష్ వర్మ క్లారిటీ ఇచ్చారు.స్పైన్ థ్రిల్లర్ రాక్షసుడు సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు రాక్షసుడు 2 సినిమాను డబుల్ థ్రిల్లర్, ఇంకా సస్పెన్షన్ తీసుకురావడానికి చాలా ఎక్సైట్ గా ఉన్నాము. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నాము అంటూ రమేష్ వర్మ వెల్లడించారు. ఇక ఈ సీక్వెల్ ని కూడా రాక్షసుడు సినిమా నిర్మాతలైన హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఏ స్టూడియోస్ అధినేత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సాగర్ డైలాగ్స్ అందిస్తున్నాడు. సినిమా ఆటోగ్రఫీ గా వెంకట్ సి దిలీప్ పనిచేస్తుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మరొకసారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తాడా? లేక మరో స్టార్ హీరో నటిస్తాడా ?అనే విషయం బాగా వైరల్ గా మారుతుంది. ఇక సస్పెన్స్ వీడాలి అంటే మళ్ళీ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version