Ram :ప్రతీ టికెట్ మీద రూ.5/-లు.. నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం….

-

మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా  తాజాగా  రూపొందుతున్న చిత్రం రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) .  ఈ చిత్రం లో ధన్య బాలకృష్ణన్ కథానాయికగా నటిస్తోంది.దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్.    ఈ మూవీనీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదల అయినటువంటి టీజర్, ట్రైలర్‌‌లకి మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. ‘మంచి కంటెంట్‌తో రామ్ సినిమా రాబోతోంది అని, ఎన్నో ఆర్థిక కష్టాలు పడి ఈ మూవీనీ నిర్మించారు.

 

ఇక నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ.. ‘మాకు ఇది మొదటి సినిమా, దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా చిత్రాన్ని తీశారు. ఇక ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ఆడియన్స్ కంటతడి పెడతారు. సాయి కుమార్,భాను చందర్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు కానీ ఈ మూవీకి తెగే ప్రతీ టికెట్‌లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌కు ఇస్తామని, అంతేకాక మన దేశ సైనికులకు ఈ మూవీనీ అంకితం చేస్తున్నామ’ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news