ఈ నెల 28న మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్న ఎమ్మెల్సీ ……

-

జనవరి 28వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యప్రదేశ్ ఓబీసీ హక్కల ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా కవిత హాజరు కానున్నారు. ఫ్రంట్ వ్యవస్థానకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ ‘పీడిత్ అధికార్ యాత్ర’ను చేపట్టనున్నాడు. ఈ యాత్రను దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు.

దామోదర్ సింగ్ యాదవ్‌ ఓబీసీ హక్కల కోసం పోరాటం చేస్తున్న నేపథ్యంలో అతనికి మద్ధతుగా కవిత అక్కడి ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల డిమాండ్ల, హక్కల సాధన కోసం దామోదర్ సింగ్ యాదవ్ మధ్ప్రదేశ్ కేంద్రంలో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news