రామ్ చరణ్ సరికొత్త వ్యూహం…!

-

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే రామ్ చరణ్ చేసే సినిమాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాయని అంటూ ఉంటారు. అతను చేసే ప్రతీ సినిమా కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తారు. ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే జాగ్రత్తగా సినిమాలు చేయడం అతని స్టైల్. అందుకే దర్శకులకు అవకాశం ఇచ్చే సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించి ఆ కథ నచ్చితేనే సినిమా చేస్తాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలో కరోనా ప్రభావం తగ్గిన వెంటనే సినిమా షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ని రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసింది చిత్ర యూనిట్.

త్వరలోనే అతను తాను చేయబోయే కొత్త సినిమాను పరిచయం చేస్తాడని అంటున్నారు. ఈసారి అతను కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే కథ నచ్చడం తో అతనికి అవకాశం ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అని, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది అంటున్నారు. హీరోయిన్ గా రష్మిక మంధన ని దాదాపుగా ఖరారు చేసారట.

Read more RELATED
Recommended to you

Latest news