Rangamarthanda : థియేటర్ లోకి ‘రంగమార్తాండ’ వచ్చేది ఉగాదికే

-

సినిమా ప్రేక్షకులకు రంగమార్తాండ చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీని ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ఓ పోస్టర్‌ విడుదల చేసింది. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్‌సామ్రాట్’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. రంగస్థల కళాకారుల జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, అలీ రెజా, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రత్యేక షో ద్వారా ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు అద్భుతంగా ఉందంటూ కృష్ణవంశీకి కితాబిచ్చారు. ముఖ్యంగా బ్రహ్మానందం పాత్ర భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు. దర్శకులు శేఖర్‌ కమ్ముల, హరీశ్‌ శంకర్‌, బి. గోపాల్‌, దేవ కట్టా, బుచ్చిబాబు, నందిని రెడ్డి, తేజ,  అనుదీప్‌ కె. వి. తదితరులు ‘రంగమార్తాండ’ ప్రీమియర్‌ చూసి, తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

https://mobile.twitter.com/TheAakashavaani/status/1636026504197943300

Read more RELATED
Recommended to you

Latest news