ప్రేమపేరుతో నమ్మించి బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం

-

ప్రేమపేరుతో నమ్మించి ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. పరిటాల గ్రామంలో ఉండే షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి.. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మిబలికాడు. వసతి గృహంలో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు. తీరా యువతి అక్కడకు వెళ్ళేసరికి హుస్సేన్ స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) ఇంట్లో ఉన్నారు.

rape

ఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్‌ను నిలదీసింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించాడు.ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన హుస్సేన్..ప్రభుదాస్‌తో కలిసి ఇంటి బయట కాపలా ఉన్నాడు. ఈ క్రమంలోనే షేక్ గాలి సైదా గది లోపలకి వచ్చి నువ్వు హుస్సేన్ దిగిన పర్సనల్ పిక్స్ తన వద్ద ఉన్నాయని..బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ శారీరకంగా గడపాలని హుస్సేన్, ప్రభుదాస్, గాలి సైదా వేధిస్తున్నారని యువతి తల్లితండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news