SAMANTHA : “సమంత”కు తెలంగాణ సర్కార్ అరుదైన అవార్డు

-

హైదరాబాద్‌ లోని… తాజ్ డెక్కన్ లో “ఛాంపియన్ ఆఫ్ చేంజ్ తెలంగాణ” అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమం నిన్న జరిగింది. సామాజిక స్పృహను పెంపొందించే లక్ష్యంతో ఏటా ఈ అవార్డులు ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే… 2021 సామాజిక సేవా విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు బిజినెస్‌ వ్యక్తులు, సినీ ప్రముఖులు, ఇతరులకు అవార్డులు బహికరించింది సర్కార్‌.

మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు, పీవీ సింధు, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి , సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బాల క్రిష్ణన్, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

గ్యాస్ట్రోనాలజీస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, పీ వీ సింధు, మై హోమ్ రామేశ్వర రావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌, హీరో అల్లు అర్జున్, యాక్టర్ ముఖేష్ రిషి ఈ అవార్డులు అందుకున్నారు. అయితే.. వీరితో పాటు.. టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత కూడా ఈ అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది సమంత.

Read more RELATED
Recommended to you

Latest news