ఐటి దాడుల్లో దొరికిపోయిన రష్మిక…!

-

తెలుగు సిని నటులను ఇప్పుడు ఐటి దాడులు భయపెడుతున్నాయి. తెలుగులో సిని నిర్మాతలను, హీరోలను టార్గెట్ చేస్తున్నారు ఐటి అధికారులు. ఇప్పుడు ఇది హీరోయిన్లకు కూడా పాకింది. పలువురు హీరోయిన్ల ఇళ్ళపై అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడే బిజీ అవుతున్న రష్మిక మంధనకు ఐటి అధికారులు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు.

కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. గురువారం ఉదయం కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్‌పేటలోగల ఆమె నివాసంలో అధికారులు దాడులు చేసారు. ఆమె ఇంటి నుంచి అధికారులు భారీ విలువజేసే ఆస్తి పత్రాలు, పెద్ద మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారని వార్తలువస్తున్నాయి. రష్మిక ఇంట్లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా ఈ దాడులు చేసారు. స్వాధీనం చేసుకున్న మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి అధికారులకు ఇవ్వలేదట. దీనితో కేసు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ భామకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మహేష్ తో నటించిన సరిలేరు నీకవ్వరు సినిమా హిట్ అవ్వడంతో ఆమెతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news