సమంతను ఒక అమ్మలా రక్షించాలని ఉంది – రష్మిక

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతా ఇటీవల అనారోగ్యం బారీన పడిన సంగతి తెలిసిందే. అయితే, సమంతా అనారోగ్యం గురించి మాట్లాడుతూ తాజాగా హీరోయిన్ రష్మిక ఎమోషనల్ అయిపోయింది. సమంత ప్రకటించే వరకు ఆ మయో సైటీస్ వ్యాధి బారిన ఆమె పడినట్లు తనకు తెలియలేదని రష్మిక ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.

సమంత మయోసైటిస్ బారిన పడినట్లు తను ప్రకటించే వరకు నాకు కూడా తెలియదు. మేము కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నా,తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాటమాత్రంగా కూడా చెప్పలేదు. సమంత చాలా అందమైన, దయగల మహిళ. ఒక అమ్మలా తనని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నా. జీవితంలో తను ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడింది. అందుకే సమంత అంటే అందరిలా నాకు కూడా స్ఫూర్తి అని రష్మిక చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version