రతన్ టాటా పరిస్థితి విషమం..ఐసీయూలో ట్రీట్మెంట్!

-

టాటా సన్స్ అధినేత శ్రీ రతన్ టాటా ( 86) ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు.ఆదివారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.ప్రస్తుతం ఆయనకు నిపుణుల వైద్య బృందం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాల్ల ఆధ్వర్యంలో టాటాకు వైద్యం జరుగుతోంది.

మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం సీరియస్‌గా ఉందని ఆస్పత్రి వర్గాల వెల్లడించినట్లు నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపాయి.
రతన్ టాటా ఆరోగ్యం విషమించిందన్న విషయం వ్యాపార వర్గాల్లోనూ ఆందోళన సృష్టించింది.ప్రముఖ పారిశ్రామిక వేత్తలు టాటా ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version