ఆర్ బీ ఐ గవర్నర్ కు కరోనా పాజిటివ్

-

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ…. చిన్న చిన్న లీడర్ల నుంచి ఉపరాష్ట్రపతి వరకు… అంతా కరోనా బారినపడుతున్నారు. అన్‌లాక్‌ మొదలైనప్పటినీ నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. పలువురు ప్రజాప్రతినిధుల ప్రాణాలను సైతం బలితీసుకుంది మహమ్మారి.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌షా, గడ్కరీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, కర్నాటక సీఎం యడియూరప్పా….. ఇలా ఎవరూ కరోనాకు అతీతం కాదని తేలిపోయింది. వీరంతా కరోనా బారినపడ్డవారే. వీరితో పాటు ఇంకా చాలా మంది ప్రజాప్రతినిథులకు కరోనా సోకింది. నిత్యం ఇద్దరు ముగ్గురు వీఐపీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక హోం ఐసోలేషన్ లో ఉండి విధులు నిర్వహిస్తానని ఆయన ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version