Breaking : కాంగ్రెస్‌లోకి రేఖా నాయక్‌..

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ రాష్ట్రాంలోని 119 స్థానాలకు గానూ 115 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉండే అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేశారు. అంతేకాకుండా.. 7గురు సిట్టింగ్‌లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడుగురిలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా ఉన్నారు. దీంతో.. బీఆర్ఎస్‌లో కుంపటి మొదలైంది.

రానున్న ఎన్నికల్లో టికెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనంతరం రేఖానాయక్ భర్త కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేఖానాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేఖా నాయక్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఖానాపూర్ టికెట్‌ను మంత్రి కేటీఆర్ మిత్రుడు భూక్య జాన్సన్ నాయక్‌కు బీఆర్ఎస్ కేటాయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version