కీలక నిర్ణయం తీసుకున్న రిలయన్స్, సౌదీ ఆరామ్ కో..!

-

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సౌదీ ఆరామ్ కో సంస్థలు కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల ప్రణాళిక పునఃముదింపు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. చమురు శుద్ధి కర్మాగారం మరియు పెట్రోకెమికల్ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కోకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

$ 15 బిలియన్ల ఒప్పందాన్ని పునముదింపు చేస్తున్నట్లు చెప్పింది. ఇప్పుడు రిలయన్స్ తన వ్యాపారాలను పరిగణలోకి తీసుకుని, మారిన పరిస్థతులకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని వలన రెండు సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఈ నిర్ణయానికి వచ్చాయి అని తెలుస్తోంది.

అలానే RIL నుంచి చమురు-రసాయనాల వ్యాపార విభజనకు ఎన్సీఎల్టీ (NCLT) వద్ద దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నమని RIL వెల్లడించింది. ఇండియా లో ప్రైవేటు రంగం లో పెట్టుబడులకు సౌదీ ఆరామ్ కో భాగస్వామిగా RIL ఉంటుందంది.

సౌదీ అరేబియాలో పెట్టుబడులకు సౌదీ ఆరామ్ కో, ఎస్ఏబీఐసీ తో కలిసి ముందు సాగుతామని RIL చెప్పడం జరిగింది. అయితే 2019లో O2C బిజినెస్ కు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసుకున్నాయి కూడా. ఇక కాంప్లెక్స్‌లో భాగమైన నాలుగు గిగా ఫ్యాక్టరీలు ఏమి కలిగుంటాయో చూస్తే..

1. సౌర శక్తి ఉత్పత్తి కోసం ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మోడ్యూల్ ఫ్యాక్టరీ.
2. స్టోరేజ్ చేయడానికి అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాక్టరీ ఫ్యాక్టరీ.
3. గ్రీన్ హైడ్రోజెన్ ప్రొడక్షన్ కోసం ఒక ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ
4. హైడ్రోజన్‌ను మోటివ్ మరియు స్టేషనరీ పావ్‌గా మార్చడానికి ఇంధన సెల్ ఫ్యాక్టరీ.

ధీరూబాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ అభివృద్ధిలో భాగంగా రిలయన్స్ ఇటీవల న్యూ ఎనర్జీ & మెటీరియల్స్ వ్యాపారాల కోసం ప్రణాళికని చేసుకోవడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news