నువ్వు ఎవడ్రా చెప్పడానికి.. కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్..!

-

నువ్వు ఎవడ్రా చెప్పడానికి అని ఖమ్మం కార్యకర్తల సమావేశంలో కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. మండల ప్రెసిడెంట్లు అని ఎవరెవరో కూర్చున్నారు అయితే అందరూ నాకు కనపడటం లేదు అన్ని ఏరియాస్ నుంచి మండల ప్రెసిడెంట్స్ రాలేదు. ఇంత నిర్లక్ష్యం చేయడం వీలు కాదు అని అన్నారు. అలానే ఆమె మాట్లాడుతూ పదవుల కోసం పాకులాడటం, చిల్లర వేషాలు, నాటకాలు, మోసాలు మానేయండి అని అన్నారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టుకుంటారు అని ఫైర్ అయ్యారు.

మీకు పదవులు కనుక కావాలి అంటే ఏ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో చూస్తాం అన్న రేణుక చౌదరి కార్యకర్తలు పై గొడవ చేశారు.. మీరు ఇన్నీ రోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తే ఎలా అని కార్యకర్త అంటే నువ్వు ఎవడ్రా చెప్పడానికి అంటూ కార్యకర్త పై రేణుక చౌదరి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news