రేవంత్ మమ్మల్ని బలిచేయాలని చూస్తున్నాడు : గ్రూప్-1 అభ్యర్థులు

-

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు గత రాత్రి నుంచి అశోక్ నగర్‌లో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం గ్రూప్-1 అభ్యర్థులు సమిష్టిగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో అభ్యర్థులు గాంధీ భవన్ వద్దకు చేరుకోగా.. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గ్రూప్-1 అభ్యర్థులతో భేటీ అయ్యి వారి డిమాండ్లను వినేందుకు ఓకే చెప్పారు.

ఈ సందర్భంగా గ్రూప్-1 అభ్యర్థులు మాట్లాడుతూ.. సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నాడు.. అదే సోనియా గాంధీ పుట్టిన రోజు మమ్మల్ని బలి చేయడానికి బలి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఒక్క సోనియమ్మను ఆనంద పరచడానికి తెలంగాణలోని 40 లక్షల నిరుద్యోగుల యొక్క అమ్మలను కష్ట పెడుతున్నారంటూ గ్రూప్ -1 అభ్యర్థి ఒకరు ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాగైనా ఈ పరీక్షలు వాయిదా వేసి తమ డిమాండ్లను వినాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news