అక్టోబర్ 22, 23 తేదీల్లో “అమరావతి డ్రోన్ సమిట్”

-

ఏపి మౌలిక వసతుల రూపకల్పన శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. అమరావతిలో అక్టోబర్ 22, 23 తేదీల్లో “అమరావతి డ్రోన్ సమిట్” న నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జాతీయస్థాయిలో“అమరావతి డ్రోన్ సమిట్” నిర్వహిస్తున్నామన్నారు ఏపి మౌలిక వసతుల రూపకల్పన శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్.

డ్రోన్ రంగంలోని సంబంధిత సంస్థలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎంట్రీ కి ఎలాంటి నిబంధనలు లేవన్నారు ఏపి మౌలిక వసతుల రూపకల్పన శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్. స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలోపాల్గోని, డ్రోన్ రంగాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వచ్చన్నారు. పౌర సంబంధిత సేవల్లో డ్రోన్ ఉపయోగం పై చర్చలు జరుగుతాయని వివరించారు. డ్రోన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపి ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు ఏపి మౌలిక వసతుల రూపకల్పన శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news