సీఎం అయ్యాక మొదటి సారి సొంత నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి..!

-

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు కొడంగల్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొదటిసారి నియోజకవర్గానికి వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కోస్గి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy

తర్వాత అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొబోతున్నారు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు ఇది వరకే తన సొంత సెగ్మెంట్లో పర్యటించాలని రేవంత్ రెడ్డి అనుకున్న వివిధ కారణాలతో వాయిదా పడింది ఈ కార్యక్రమంలో రేపటి పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news