మోదీ కేసీఆర్ లు చీకటి మిత్రులు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… BRS మరియు బీజేపీ లు చూపుడుగా అలా శత్రువులు లాగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారని, వాస్తవానికి ఈ రెండు పార్టీలది ఫెవికాల్ లాంటి బంధమని చెప్పడం విశేషం. ఈ విషయాన్ని మేము మొదటి నుండి చెబుతూ వస్తున్నాము కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి అసహనాన్ని బయట పెట్టాడు. తెలంగాణాలో సీఎం గా కేసీఆర్ ఉన్నంత కాలం మోదీ ఏమి చేస్తే అది జరుగుతూ ఉంటుందంటూ రేవంత్ చెప్పారు. తెలంగాణాలో కేసీఆర్ మోడీ ఆసిస్సులు లేనిదే కష్టమంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇప్పటికీ ఎప్పటికీ మోదీ మరియయు కేసీఆర్ లు చీకటి మిత్రులుగా కొనసాగుతారన్నది పచ్చి నిజం అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడుల. కాగా ఈ వ్యాఖ్యలపై అటు కేసీఆర్ లేదా కేటీఆర్ మరియు బీజేపీ ల నుండి ఏమైనా స్పందన వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version