ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆరే : రేవంత్ రెడ్డి

-

ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కావడానికి కారణం కేసీఆర్ అని… ఆ పార్టీలోకి కావాలనే పంపాడని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ తో చర్చలకు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి డిల్లీ నుంచి వచ్చిన ప్రైవేట్ విమానం ఎవరిది..? ఆ ప్రవేట్ విమానం ఏర్పాటు చేసిందే కేసీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎవరినో గెలిపించేందుకు ఎందుకు పనిచేస్తుందని… మా పార్టీ సన్యాసుల మఠం కాదుకదా అని చురకలు అంటించారు.

జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు అవని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే .. నేను గజ్వెల్ కు వెళ్ళడం ఖాయమని హెచ్చరించారు. గజ్వేల్ లో ఉపఎన్నిక రావాలంటే కేసీఆర్ రాజీనామా చేయాలి కదా ..? అక్కడ నేను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి ఆఫీసర్ .. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా బయటికి వచ్చారని మండిపడ్డారు.. రాహుల్ బొజ్జా సమర్థవంతమైన అధికారి .. ఆయనకు ఏదో పెద్ద అవకాశం ఇచ్చానని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఇది దళితులను అవమానించడమేనని ఫైర్‌ అయ్యారు. కౌశిక్ రెడ్డి టీఆరెఎస్ లో చేరడం .. ఎమ్మెల్సీ ఇస్తాననడం చైల్డ్ రేప్ లాంటిదన్నారు.. కిషన్ రెడ్డి, బండిసంజయ్ యాత్రలు బిజెపిలో కేసీఆర్ అనుకూల వ్యతిరేక వర్గాల పోరాటమేనని రేవంత్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version